Posted on 2025-12-05 07:23:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అవినీతి లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి సాయ రెడ్డి పెట్రోల్ బంక్ వరకు చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యాలయాల్లో అధికారులు ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడకుండా నిబద్ధతతో పనిచేసినప్పుడే సమాజం బాగుపడుతుందని అలాగే దేశం అభివృద్ధి బాటన నడుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు లంచాలకు అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం తమకు నిర్దేశించిన పనుల్లో పనిచేసి ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో నే సరి పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల చేతిలో చిక్కడం హేయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ పౌరులు పనులు జరుగుతాయని ఆశతో వచ్చిన వారికి వీలైనంత త్వరగా వారి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలి తప్ప వారిని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ పదేపదే తిప్పించుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో బసవ రెడ్డి, ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్, ఏసీబీ సిబ్బంది అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >