| Daily భారత్
Logo




ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ బిరుదురోహిత్ రాజు

News

Posted on 2025-11-28 08:25:27

Share: Share


ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ బిరుదురోహిత్ రాజు

డైలీ భారత్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.జిల్లా వ్యాప్తంగా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,06 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలు,06 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను,04 అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండల గ్రామాల్లోగ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎఫ్‌ఎస్‌టి (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్),ఎస్‌ఎస్‌టి (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్),చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.డ్యూటీ పాస్‌పోర్ట్ అందుకున్న వెంటనే,ఎఫ్‌ఎస్‌టి,ఎస్‌ఎస్‌టి సిబ్బంది సంబంధిత ఇన్‌చార్జ్ అధికారిని సంప్రదించి,వారి మొబైల్ నంబర్‌ను తీసుకొని వారితో సమన్వయం  పాటించాలనిసూచించారు. తప్పనిసరిగా మండల ప్రధాన కార్యాలయంలోనేఉండాలని,రిలీవర్ వచ్చే వరకు డ్యూటీ స్థలాన్ని విడిచి వెళ్లకూడదని తెలిపారు.తనిఖీ సమయంలో ప్రతివాహనాన్నిసమయం,వాహనం నంబర్,ప్రయాణ ఉద్దేశం మరియు తీసుకున్న చర్యతో సహా రిజిస్టర్‌లో సరిగ్గా నమోదు చేయాలని అన్నారు.ఏదైనా నగదు, మద్యం,బహుమతులు, బంగారం లేదా అనుమానాస్పద వస్తువులు దొరికితే వాటికి కాపలాగా ఉండి ఇన్‌చార్జ్ బృందానికి సహాయం చేస్తూ వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఎస్కార్ట్ చేసి,ఎటువంటి ఆలస్యం లేకుండా ఎస్‌హెచ్‌ఓ/సిఐ/డిఎస్‌పికి తెలియజేయాలని తెలిపారు.తనిఖీ మరియు స్వాధీనం చేసే సమయంలో మొబైల్ వీడియో రికార్డింగ్ ఉండేలాచూసుకోవాలన్నారు.తద్వారా పారదర్శకతను నిర్ధారించి,ఆరోపణలను నివారించవచ్చని తెలియజేశారు.ఎలాంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసుకోవాలన్నారు. అలా కనిపిస్తే ఇన్‌చార్జ్ సూచనల మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల తనిఖీ సమయంలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అన్ని విభాగాల అధికారులతో సమన్వయం పాటిస్తూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ అధికారులు,సిబ్బంది భాద్యతగా విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ తెలియజేసిన వారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >