Posted on 2025-11-27 18:17:50
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇంటి పై ఏసిబీ అధికారుల దాడులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెడుతూ ప్రజల నుండి అక్రమంగా అవినీతి సొమ్మును కాజేస్తున్న అవినీతి అధికారులపై ఎస్ సి బి అధికారులు కొరడా ఝాలిపిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ప్రభుత్వ కార్యాలయాల లో ఏసీబీ అధికారుల దాడులు వార్తలు గత కొద్దిరోజులుగా వింటూనే ఉన్నప్పటికీ లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు కనబడడం లేదు. ఎక్కడ ఏ చిన్న చాన్సు దొరికితే ఏమాత్రం తలోగ్గాకుండా అక్రమ అవినీతి సొమ్ము కోసం ఆరటు పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంకా సదరు మున్సిపల్ కమిషనర్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.
#acb #armur #Nizamabad
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >