| Daily భారత్
Logo




ధాన్యం వేగంగా కొనాలి.. డబ్బులు వెంటనే చెల్లించాలి : సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

News

Posted on 2025-11-20 15:48:07

Share: Share


ధాన్యం వేగంగా కొనాలి.. డబ్బులు వెంటనే చెల్లించాలి : సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

ధాన్యం వేగంగా కొనాలి.. డబ్బులు వెంటనే చెల్లించాలి.

నాణ్యమైన గన్నీ సంచులు సరఫరా చేయాలి

కాటా వేసిన బస్తాలను వెంటనే తరలించాలి.

ప్యాడీ డ్రైయర్ మిషన్ ఖర్చును ప్రభుత్వం భరించాలి.

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

డైలీ భారత్ న్యూస్, వైరా:రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా ధాన్యం కొనుగోలు జరపాలని, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు చెల్లించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైరా వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం బృందం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన గన్నీ సంచులు సరఫరా చేయాలని, కాటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే తరలించాలని అన్నారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ వల్ల రైతులకు  ఖర్చు పెరుగుతుందని తెలిపారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ లో గంటకు ఐదు లీటర్ల డీజిల్ కాలుతుందని, గంటకు కేవలం 8 శాతం తేమ మాత్రమే తగ్గుతుందని, 20 బస్తాల ధాన్యానికి సుమారు 5000 రూపాయల ఖర్చు అవుతుందని, ఇది రైతులకు భారం అని అన్నారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ ఖర్చును ప్రభుత్వం భరించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు రైతులకు అండగా నిలబడాలని, రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహనరావు, కొంగర సుధాకర్, కామినేని రవి, బెజవాడ వీరభద్రం, గొల్లపుడి ప్రకాశరావు, అమరనేని కృష్ణ, చిత్తోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >