| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కరీంనగర్ కలెక్టరేట్ లో "వందేమాతరం" గేయాలాపన

కరీంనగర్ కలెక్టరేట్ లో "వందేమాతరం" గేయాలాపన

డైలీ భారత్, కరీంనగర్:స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 యేండ్లు పూర్తయింది.

ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో శుక్రవారం ఉదయం సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వు మేరకు కరీంనగర్ కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని ఉద్యోగులు ఆలపించారు.

 జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Previous ఏసీబికి పట్టుబడిన పౌర సరఫరాల అధికారులు
Next పోలీస్ శాఖ ఆద్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం ఆలవన వేడుకల నిర్వహణ
ADVERTISEMENT