Posted on 2025-11-06 20:08:39
తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
వివిధ శాఖల పనులపై సమీక్ష సమావేశం
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పంచాయతీ రాజ్ (పీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో విద్యా శాఖ, పంచాయతీ, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ భవనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద జిల్లాలో మొదలు పెట్టిన పనులపై వివిధ శాఖల, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. జిల్లాలో 49 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు కాగా, పలు భవనాలు పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పనులను పూర్తి చేసి, పిల్లలను ఆకట్టుకునే రంగులు వేయాలని, నీటి వసతి మిషన్ భగీరథ ద్వారా కల్పించాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీ భవనాల పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
భవిత కేంద్రాల భవనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గడువు పెట్టి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >