Posted on 2024-01-07 13:15:57
డీజిల్ లేదని డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం
డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల ప్రజలు ఆఖరు ఘట్టానికి అవస్థలు పడుతున్నారు. దానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య పనితీరు మరింత తోడవుతుంది. వార్డుకు చెందిన ఒక వ్యక్తి గుండె నొప్పితో మరణించాడు. అయితే వార్డులో స్మశాన వాటిక లేదు. మృత దేహాన్ని మూడు కిలో మీటర్లకు పైగా వెళ్లి ఖననం చేయాలి. ఒంటి గంటకు స్థానికులు వైకుంఠ రథాన్ని పంపాలని సంబధిత మున్సిపల్ అధికారులకు తెలిపారు. సంబంధిత అధికారి డ్రైవర్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు గంటల వరకు వేచి చూసిన స్థానికులు డ్రైవర్ కు ఫోన్ చేయగా డీజిల్ లేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక మృత దేహాన్ని మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు చేశారు. మున్సిపల్ అధికారుల పనితీరుపై వార్డు ప్రజలు మండిపడుతున్నారు. ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి స్మశాన వాటిక నిర్మించాలని ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని, కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే స్మశాన వాటిక మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ కోరారు.
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు
Posted On 2026-04-03 03:53:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు
Posted On 2026-04-03 03:51:24
Readmore >
హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...
Posted On 2026-04-03 03:27:41
Readmore >
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
Posted On 2026-04-03 03:25:40
Readmore >