Posted on 2024-01-07 08:31:56
డైలీ భారత్, సిద్దిపేట జిల్లా:కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి మల్లన్న కల్యాణ వేడుకలుఆదివారం ఉదయం అత్యంత ఘనంగా జరిగాయి.
మల్లన్న శరణు శరణు అంటూ జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.
కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివశక్తులు శివాలెత్తి పోయారు.
ఒగ్గు పూజారులు ఆధ్వ ర్యంలో సంప్రదాయ బద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ లను మల్లన్న పెళ్లాడారు. స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆలయ పాలక మండలి, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు...
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు
Posted On 2026-04-03 03:53:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు
Posted On 2026-04-03 03:51:24
Readmore >
హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...
Posted On 2026-04-03 03:27:41
Readmore >
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
Posted On 2026-04-03 03:25:40
Readmore >
భద్రాచలం పాదయాత్రకు తరలి వెళ్లిన తల్లాడ మండలం నారాయణపురం భక్తులు
Posted On 2026-04-03 03:24:24
Readmore >