డైలీ భారత్, హైదరాబాద్:భారత ఒలింపిక్ అసోసియేషన్ ఐఏసీ,కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ శుక్రవారం సాయంత్రం ఎంపికయ్యారు.
గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా పని చేశారు. ఈ మేరకు ఒలిం పిక్ అసోసియేషన్ తెలి పింది. క్రీడా నిర్వహణ లో రఘురామ్ కు విశేష అను భవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది.
పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘు రాంను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా పేర్కొంది.
సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘు రామ్ నియామకం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కు సీఈఓగా పని చేసిన రఘురాం గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహిం చారు....