Posted on 2025-10-19 16:13:12
గుమ,గుమ లాడే గులాబ్ జామ్ లో వెంట్రుకలు ప్రత్యక్షం
ఓ ప్రముఖ స్వీట్ హోమ్ లో వెలుగు చూసిన వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దీపావళి పండుగ పూట గుమ గుమ లాడే గులాబ్ జామ్ తినాలనుకుంటున్నారా... అయితే తస్మాత్ జాగ్రత్త.. స్వీట్లో వెంట్రుకలు ప్రత్యక్షమై కొనుగోలుదారులలో షాక్ ను గురిచేసింది. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ స్వీట్ హోమ్ లోనీ గులాబ్ జామ్ లో తల వెంట్రుకలు రావడం జిల్లా కేంద్రంలో ఆదివారం కలకలం రేపింది.
నిజామాబాద్ నగరంలోని పేరు ప్రఖ్యాతలు కలిగిన స్వీట్ హోమ్ లో ఈ సంఘటన వెలుగులోకి రావడం విస్మయం కలిగించింది. దీపావళి పండుగ ను పురస్కరించుకొని మిఠాయిలు కొనుగోలు చేసిన వారికి గులాబ్ జామ్ లో వెంట్రుకలు రావడం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్డు ప్రాంతంలో గల ఓ ప్రముఖ స్వీట్ హోమ్ లో ఓ వ్యక్తి గత శుక్రవారం గులాబ్ జామ్ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి చూడగా అందులో వెంట్రుకలు ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే స్వీట్ హోమ్ కు వచ్చి వారిని నిలదీయడంతో స్వీట్ హోమ్ యజమాని కస్టమర్ ను బెదిరించి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెప్పాడు. దీంతో కస్టమర్ గులాబ్ జామ్ లను వీడియో తీసి వెంటనే సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీతకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ స్వీట్ హోమ్ పై దాడి చేసి మిఠాయిలను పరిశీలించారు. వెంట్రుకలతో తయారుచేసిన గులాబ్ జామ్ లను స్వాధీనం చేసుకొని పోరిన్సిక్ ల్యాబ్ కు పరిశీలన కోసం పంపించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ ను వివరణ కోరగా గులాబ్ జామ్ లో వెంట్రుకలు వచ్చిన విషయం వాస్తవమేనని, కస్టమర్ ఫిర్యాదుతో స్వీట్ హోమ్ లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో గులాబ్ జామ్ ల లో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించి స్వీట్ హోమ్ యజమానికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు హానీ కలిగించే విధంగా తిను బండారాలను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >