Posted on 2025-10-19 15:59:44
పరారీలో ఉన్న హంతకున్ని 48 గంటల లోపే పట్టుకున్న పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్తులు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ కేసులో రాష్ట్ర డిజిపి, డిఐజి త్వరగా ఈ కేసును చేదించాలని జిల్లా సీపీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 9 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో నిందితులు రియాజ్ ను ఆదివారం పట్టుకున్నట్లు తెలుస్తుంది. కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.
పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ను శుక్రవారం (అక్టోబరు 17)న అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ ప్రమోద్ను ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కమిషనరేట్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరో ఠాణా పరిధిలో..
నిజామాబాద్ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్స్థానిక కెనాల్ సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్ సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్లు సమాచారం.
మరోసారి పోలీసులపై దాడికి తెగబడిన రియాజ్
పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి
ఆసుపత్రి కి తరలింపు .. తెగించి పట్టుకున్న ఇద్దరు పోలీసులు..?
సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది. ఈ లోపు కానిస్టేబుళ్లు రియాజ్ ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >