| Daily భారత్
Logo




రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

News

Posted on 2025-10-19 15:59:44

Share: Share


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

పరారీలో ఉన్న  హంతకున్ని 48 గంటల లోపే పట్టుకున్న పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్  కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్తులు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ కేసులో రాష్ట్ర డిజిపి, డిఐజి త్వరగా ఈ కేసును చేదించాలని జిల్లా సీపీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 9 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో నిందితులు రియాజ్ ను ఆదివారం పట్టుకున్నట్లు తెలుస్తుంది. కమిషనరేట్​ పరిధిలోని సీసీఎస్​ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్​ ప్రమోద్​  దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్​ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్​ను శుక్రవారం (అక్టోబరు 17)న అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్​కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్​ ప్రమోద్​పై నిందితుడు రియాజ్​ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను​ ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్​ పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా.. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న కమిషనరేట్​ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరో ఠాణా పరిధిలో..
నిజామాబాద్​ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్​ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని నిందితుడు రియాజ్​ ఉపయోగించిన బైక్​స్థానిక కెనాల్​  సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్​లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్​  సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్​ శివారులో పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్లు సమాచారం.


మరోసారి పోలీసులపై దాడికి తెగబడిన రియాజ్

పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి

ఆసుపత్రి కి తరలింపు .. తెగించి పట్టుకున్న ఇద్దరు పోలీసులు..?


సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది. ఈ లోపు కానిస్టేబుళ్లు రియాజ్ ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Image 1

“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”

Posted On 2026-05-10 13:12:35

Readmore >
Image 1

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!

Posted On 2026-05-10 12:16:45

Readmore >
Image 1

కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-10 11:54:36

Readmore >
Image 1

యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

Posted On 2026-05-10 11:52:11

Readmore >
Image 1

పెళ్లి పేరుతో వంచన... దేవస్థానం ఉద్యోగిపై కేసు నమోదు.?

Posted On 2026-05-10 11:10:13

Readmore >
Image 1

ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

Posted On 2026-05-10 08:24:05

Readmore >
Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >