| Daily భారత్
Logo




రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

News

Posted on 2025-10-19 15:59:44

Share: Share


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

పరారీలో ఉన్న  హంతకున్ని 48 గంటల లోపే పట్టుకున్న పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్  కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్తులు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ కేసులో రాష్ట్ర డిజిపి, డిఐజి త్వరగా ఈ కేసును చేదించాలని జిల్లా సీపీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 9 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో నిందితులు రియాజ్ ను ఆదివారం పట్టుకున్నట్లు తెలుస్తుంది. కమిషనరేట్​ పరిధిలోని సీసీఎస్​ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్​ ప్రమోద్​  దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్​ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్​ను శుక్రవారం (అక్టోబరు 17)న అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్​కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్​ ప్రమోద్​పై నిందితుడు రియాజ్​ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను​ ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్​ పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా.. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న కమిషనరేట్​ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరో ఠాణా పరిధిలో..
నిజామాబాద్​ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్​ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని నిందితుడు రియాజ్​ ఉపయోగించిన బైక్​స్థానిక కెనాల్​  సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్​లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్​  సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్​ శివారులో పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్లు సమాచారం.


మరోసారి పోలీసులపై దాడికి తెగబడిన రియాజ్

పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి

ఆసుపత్రి కి తరలింపు .. తెగించి పట్టుకున్న ఇద్దరు పోలీసులు..?


సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది. ఈ లోపు కానిస్టేబుళ్లు రియాజ్ ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >