Posted on 2025-10-19 13:34:03
డైలీ భారత్, స్పెషల్ శీర్షిక:
విద్యుద్దీపాల కాంతులను వద్దని,
మట్టి ప్రమిదలతో ఇంటిని అలంకరిద్దాం,
అమ్మవారి కన్నుల్లో వెలుగు జ్యోతులు,
కాంతిమయంగా చూసి ఆనందిద్దాం.
కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా,
మట్టి దీపాలలో జ్యోతులు వెలిగిద్దాం,
పూరి గుడిసెల్లో అమావాస్య చీకట్లు మాయమై,
వెలుగు పుష్పాలతో విరాజిల్లెను ఆకాశం
మనం అందించే చిన్న పైకంతో,
ప్రమిదల తయారీ కుటుంబాల ఆకలి తీర్చి,
వారి ఇంటి ముంగిట దీపాల తేజం,
ఈ భవ్య దీపావళి సౌరభం చిగురించేలా చేద్దాం
మహిళలు అబల కాదు, సబల అని చాటిన రోజు,
చెడుపై మంచి జయించిన శుభ దినం,
వెలుగు దివ్వెను ఆర్పే వడివడి గాలిని,
తట్టుకొని, దేదీప్యమానంగా వెలుగుతూ,
కష్టాలు క్షణికమని చాటే దీపావళి జరుపుకుందాం
పెద్దలు, పిల్లలు, పాపలు ఒక్కచోట చేరి,
సంతోషంగా దీపాల వెలుగులో మునిగి,
జరుపుకునే ఈ దివ్య దీపావళి,
మనసును ఆనందంతో నింపే పండుగా మలచుకుందాం
ఈ దీపావళి మీ జీవితంలో చీకట్లను తొలగించి,
కొత్త ఆశల వెలుగులను నింపాలని,
బాణాసంచా లేకుండా, ప్రకృతి సౌందర్యంతో,
కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని,
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక
దీపావళి శుభాకాంక్షలు!
......
రచన మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
చరవాణి: 9347042218
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >