Posted on 2025-10-18 15:36:21
పోలీసును హత్య చేసిన రియాజ్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి
ఏబీవీపీ డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిందితుడు రియాజ్ అరబ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేటువంటి పోలీసుల పైన హత్యలు దాడులు చేయడం దుర్మార్గమైన పని పోలీస్ ప్రమోద్ పై కత్తిపోట్లు పొడిచి చంపినటువంటి నిందితుడు రియాజ్ వెంటనే ని పట్టుకొని నడిరోడ్డు పైన ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి నిందితులు ఉన్నటువంటి ఈ ఏరియాలలో ఇంతకుముందే ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు తెలిసినప్పటికీ రాజకీయ నాయకులు పోలీసులు పట్టించుకోనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటికైనా ఇలాంటి ఏరియాలలో స్పెషల్ టీం లను ఉంచి ఎల్లప్పుడూ నిరంతరం నిగా ఉండేలా పోలీసుల రక్షణ వ్యవస్థలను ఉంచాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిజామాబాద్ సిపి ని ఏబీవీపీ కోరారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి,కార్తీక్, చంద్ర, అఖిలేష్, బాలకృష్ణ, గోపి,శ్రేయస్, మణికంఠ, రాజేష్,టోనీ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >