Posted on 2025-10-17 21:00:05
డైలీ భారత్ న్యూస్, వరంగల్: అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కార్యదర్శి యం.సాయి కుమార్ ఆదేశాల మేరకు రంగశాయి పేట లోని, మహిళా స్వశక్తి భవన్, వరంగల్ లో పేదరిక నిర్మూలన అంశంపై, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఛీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిల్ ఆర్. సురేష్ పాల్గొని మాట్లాడుతూ "పేదరిక నిర్మూలనలో మహిళలు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. నిరక్షరాస్యత, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోక పోవడం వల్లనే పేదరికం పెరుగుతుంది అని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడడానికి స్వయం ఉపాధి పథకాలను అనుసరించాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడి మహిళా సాధికారతకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి మెంబర్ దామోదర్, కాకతీయ సేవా సమితి ప్రెసిడెంట్ మండల నరసింహారాములు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.మల్లారెడ్డి, సెక్రటరీ రాజేంద్రప్రసాద్, మహిళా కార్యదర్శి విజయ కుమారి, కరుణాకర్, కేడల పద్మ, జగ్గారావు, వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, పూర్ణచందర్, వీరస్వామి, సత్యనారాయణ వివిధ మహిళా సంఘాల గ్రూపులు, తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >