డైలీ భారత్ న్యూస్, వరంగల్ /నర్సంపేట:స్థానిక నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె అమర్నాథ్ మాట్లాడుతూ పురాణాల ప్రకారం దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కథలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా చెడుపై మంచి సాధించే విజయంగా చీకట్లను పారదోలే వెలుగుల అజ్ఞానంపై విజ్ఞానం సాధించే విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీవిద్య, శ్రీధర్, డిజిఎం చేతన్ , ఏ జీ ఎం పద్మాకర్ ,అకాడమిక్ కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి , సి బ్యాచ్ ఇంచార్జ్ చంద్రకాంత్ , జోనల్ నాసా ఇంచార్జ్ రాజ్ కుమార్ , ప్రైమరీ ఇంచార్జ్ స్రవంతి , ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ మానస , ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
News
నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి సంబరాలు