Posted on 2025-10-18 10:15:11
పాత కేసుల్లో పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకొని వస్తుండగా ఘటన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్ ప్రాంతానికి చెందిన రియాజ్ అనే పాత నిందితుడిని సిసిఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్ ఇద్దరు కలిసి శుక్రవారం కిల్లా రోడ్డులో పట్టుకొని యాక్టివా ద్విచక్ర వాహనం పై సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక నగర్ ప్రాంతానికి రాగానే, నిందితుడు రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా పొడిచాడు. కత్తిపూట్లతో తీవ్ర రక్తస్రావమైన సదరు కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ ను దారుణం గా కత్తితో పొడిచిన అనంతరం నిందితుడు రియాజ్ అక్కడి నుండి పరారయ్యాడు. నిండుతుడి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు ఆచూకీ తెలిసినవారు వెంటనే డయల్ 100 కు లేదా దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వగలరు పోలీసు అధికారులు వెల్లడించారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >