Posted on 2025-10-17 18:02:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బీసీ బంద్ కు మద్దతు గా శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల అన్ని యూనియన్లు, జర్నలిస్టులు పూర్తి మద్దతును తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రం బీసీ బంద్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీలకు ఎన్నో సంవత్సరాల నుండి అన్యాయం జరుగుతుందని, బీసీ లకు న్యాయం చేయుటకు నేటికైనా బీసీ లందరికీ 42% రిజర్వేషన్ కల్పించుటకు పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు, అందుకు అన్ని కుల సంఘాలు , న్యాయవాదులు, వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, పాటీగల్లి మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా శనివారం నిర్వహించే బంద్ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలిపారు. తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే అని , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టం అయ్యేంతవరకు ఉద్యమంల కొనసాగుతూనే ఉంటుందని, అందుకు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే ఊవ్వేతునా కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదేవిధంగా బీసీల రిజర్వేషన్ 42 శాతం అయ్యే అంతవరకు బిసి ఉద్యమం అంతవరకు కొనసాగుతూనే ఉంటుందని బీసీ నాయకులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ చైర్మన్ పోతనకల్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య, రాష్ట్ర ఆర్య క్షత్రియ వైస్ ప్రెసిడెంట్ అంబదాసరావు, బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆదె ప్రవీణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ బైర శేఖర్, ఆర్గనైజ్ సెక్రెటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు జమాల్పూర్ గణేష్ , పాకాల నర్సింలు, గంగాదాస్, రాజేష్, పంచారెడ్డి శ్రీకాంత్, రజినిష్, గంగారెడ్డి, సతీష్ గౌడ్, నరసయ్యచారి, వెంకటేష్, రామచంద్ర రెడ్డి, సంగీత , శంకర్, వినోద్ కుమార్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >