Posted on 2025-10-16 22:19:54
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట/చెన్నారావు పేట:పోషణ మాసం సందర్భంగా ఐసిడిఎస్ నర్సంపేట పరిధిలోని చెన్నారావుపేట, తిమ్మరాయనపాడ్ సెక్టార్ సూపర్వైజర్లు రాధా, పారిజాతం ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ మధురిమ, డాక్టర్ సరోజ ముఖ్య అతిథులుగా హాజరై. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషణ మాసంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. గర్భిణీలో బాలింతలు కిశోర బాలికలు, చిన్నపిల్లలు ప్రోటీన్స్,విటమిన్లతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. కిశోర బాలికలకు రక్తహీనత పై అవగాహన కల్పించి ఐరన్ అధికంగా ఉండే ఆహరపదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలని తెలిపారు. స్త్రీల రుతుక్రమ పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. సరైన పోషణకహారం తీసుకోవడం స్థానికంగా లభించే ఆకుకూరలు పండ్లు కూరగాయలు చిరుధాన్యాలతో చేసినటువంటి రాగి జావా,మిల్లెట్స్ తో చేసినటువంటి ఆహారాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం వెల్ బేబీ షో నిర్వహించి పిల్లలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ కోఆర్డినెటర్స్ శ్రీలత,అనిత, ఐకెపి సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >
చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-08 16:49:46
Readmore >
జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
Posted On 2026-05-08 16:44:09
Readmore >
నూతన జిల్లా DFO ను కలిసిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ డిపోల యాజమానుల సంఘం
Posted On 2026-05-08 16:42:57
Readmore >
అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
Posted On 2026-05-08 11:47:46
Readmore >