Posted on 2025-10-16 22:21:04
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట/నల్లబెల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన కలిగి ఉండాలని నల్లబెల్లి వైద్య అధికారి పిబి ఆచార్య, వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీమ్ డిఆర్పి ఎండి ముస్తాక్ అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవి పై అవగాహన ర్యాలీని నల్లబెల్లి మండల వైద్య అధికారి ఆచార్య జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారానే వ్యాప్తి చెందుతుంది అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన రక్తమార్పిడి, కలుషితమైన సూదులు చిరంజీలు, హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు వ్యాపిస్తుందని అన్నారు. మరి ఏ పద్ధతుల ద్వారా హెచ్ఐవి వ్యాపించదు. హెచ్ఐవి వారిపట్ల వివక్షత చూపకుండా మనలో ఒకరిగా ఆదరించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన వివో మీటింగులో డిఆర్పి ముస్తాక్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎస్.టి.ఐ వ్యాప్తి, నివారణ మార్గాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ మిల్క్ వర్కర్ స్కీం ప్రతినిధులు సామల వీరన్న, జరుపుల లింగన్న, మురళి, స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >
చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-08 16:49:46
Readmore >
జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
Posted On 2026-05-08 16:44:09
Readmore >
నూతన జిల్లా DFO ను కలిసిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ డిపోల యాజమానుల సంఘం
Posted On 2026-05-08 16:42:57
Readmore >