Posted on 2025-10-16 18:02:01
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా
డైలీ భారత్, నిజామాబాద్:టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా, కష్ట సమయంలో తాము ఉన్నామంటూ 30వ డివిజన్ కు చెందిన మైనార్టీ నాయకులు మతిన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది మైనార్టీ యువకులు మాజీ అర్బన్ ఎమ్మెల్యే ది సుమారు 200 మంది మైనార్టీ యువకులు మాజీ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకున్నా కష్టకాలంలో తామున్నామంటూ పార్టీకి అండగా నిలిచిన మైనార్టీ నాయకులను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని ఆయన అన్నారు. పదేళ్లపాటు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వెంట నడిచిన వారు అధికార దాహంతో ఇతర పార్టీలో చేరిన వారు తన దృష్టిలో గాడిదలతో సమానమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అర్బన్ నియోజకవర్గం స్వర్ణ భూమిని తలపించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడ్డదని ఆయన విమర్శించారు. స్థానిక అర్బన్ బిజెపి ఎమ్మెల్యే తన చేతిలో ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే తాను ఏమైనా చేయొచ్చని చేతులెత్తేసారని, ఇక అర్బన్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ బడా నేతలుగా చెప్పుకునే నేతలు తమ స్వలాభం కోసం అధికారాల కోసం నామినేటెడ్ పోస్టుల పోస్టులు పెట్టారే కానీ ప్రజలకు ఏం అవసరమో అవి చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎవరికి తాగడానికి కనీసం నీరు కూడా సరైన సమయంలో అందివ్వని దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక తన హయాంలో నగరం మొత్తం వీధి దీపాలతో వెలిగేవని ఇప్పుడు వీధి దీపాలు ఒక ప్రాంతంలో వస్తే ఇంకో ప్రాంతంలో రాని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేకున్నా గాని పార్టీలోకి వచ్చిన వారిని పార్టీ కనురెప్పల చూసుకుంటుందని ఆయన అన్నారు. వచ్చేది మన పార్టీ నేనాని ఎవరు ఆందోళన నిరాశకు గురవద్దని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నూతనంగా వచ్చిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్ పార్టీ సీనియర్ నాయకులు దండు శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >