డైలీ భారత్, కడప: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) జాతీయ లీగల్ అడ్వైజర్ గా నాయనపల్లి అనుదీప్ జయసింహ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ లీగల్ అడ్వైజర్ గా ఎన్నికైన అనుదీప్ జయ సింహ మాట్లాడుతూ ప్రతినిత్యం అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ లీగల్ గా సేవలందిస్తూ అఖిల భారత భక్తుల సంఘం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.. తనను జాతీయ కమిటీ లీగల్ అడ్వైజర్ గా నియమించినందుకు జాతీయ కమిటీ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
News
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ లీగల్ అడ్వైజర్ గా నాయనపల్లి అనుదీప్ జయసింహ