డైలీ భారత్, పాల్వంచ: కులమతాలకతీతంగా అన్ని మతాలవారు సమాజ సేవ చేస్తూ మానవత్వం చాటాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఒడ్డుగూడెం,షేక్ ఖాసిం,పాత పాల్వంచకు చెందిన షేక్ జానీ మియా,మహమ్మద్ యూసఫ్ బాబా,మహమ్మద్ ఖాదర్ బాబు, షేక్ యాకూబ్ మియా,షేక్ రహీం, హజ్(ఉమ్రా) యాత్రకు సెప్టెంబర్ 17వ తేదీన వెళ్లి అక్టోబర్ 1వ తేదీన యాత్ర విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా కొత్వాల వారిని సన్మానించారు. సోమవారం ఒడ్డుగూడెం లోని ఖాసిం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గెట్ టు గెదర్ కార్యక్రమంలో వారిని శాలువా బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం పరోపకారమే అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్ వి ఆర్ కె ఆచార్యులు,పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతి వర్ధన్,కె రామశేషం రాజు(పెద్దరాజు),చింతలచెరువు రమేష్,ఎస్ కె చాంద్ మియా, అహ్మద్ జానీ,యాకూబ్,అక్బర్,ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.