Posted on 2025-10-13 16:22:25
డైలీ భారత్, పాల్వంచ: కులమతాలకతీతంగా అన్ని మతాలవారు సమాజ సేవ చేస్తూ మానవత్వం చాటాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఒడ్డుగూడెం,షేక్ ఖాసిం,పాత పాల్వంచకు చెందిన షేక్ జానీ మియా,మహమ్మద్ యూసఫ్ బాబా,మహమ్మద్ ఖాదర్ బాబు, షేక్ యాకూబ్ మియా,షేక్ రహీం, హజ్(ఉమ్రా) యాత్రకు సెప్టెంబర్ 17వ తేదీన వెళ్లి అక్టోబర్ 1వ తేదీన యాత్ర విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా కొత్వాల వారిని సన్మానించారు. సోమవారం ఒడ్డుగూడెం లోని ఖాసిం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గెట్ టు గెదర్ కార్యక్రమంలో వారిని శాలువా బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం పరోపకారమే అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్ వి ఆర్ కె ఆచార్యులు,పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతి వర్ధన్,కె రామశేషం రాజు(పెద్దరాజు),చింతలచెరువు రమేష్,ఎస్ కె చాంద్ మియా, అహ్మద్ జానీ,యాకూబ్,అక్బర్,ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >