| Daily భారత్
Logo




లింగి తండా అటవీ ప్రాంతంలో అటవీ అధికారుల సాక్షిగా స్థానిక తండావాసుల దందా..

News

Posted on 2025-10-08 21:14:14

Share: Share


లింగి తండా అటవీ ప్రాంతంలో అటవీ అధికారుల సాక్షిగా స్థానిక తండావాసుల దందా..

యదేచ్ఛగా చెట్లను నరుకుతున్న పట్టించుకోని అటవీశాఖ అధికారులు

తాజాగా 12 మంది పై  నామమాత్రపు కేసులు.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి  సమీప దూరంలో గల లింగి తండా అడవులపై  స్థానిక తండావాసులు పంజా విసురుతున్నారు. గత కొన్ని రోజులుగా  యదేచ్చగా  ఫారెస్ట్ కు సంబంధించిన ప్రాంతాలలో   చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. మొత్తం 70 ఎకరాలలో  గత వారం రోజులుగా చెట్లను నరికేసి తమ అక్రమ వ్యాపారాన్ని  సాఫీగా సాగిస్తున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు రావడంతో హడావిడిగా  12 మందిపై  కేసు నమోదు చేశారు. ఇద్దరినీ సిసి ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వారిపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం  ఎఫ్ ఐ ఆర్  నమోదు చేశారు.  మిగిలిన 10 మందిపై  అటవీ శాఖలో  కేసు నమోదు అయింది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే  అటవీ సంపద  దోపిడికి గురవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్మగ్లర్ల అక్రమ చెట్ల నరికివేత  మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారుల అండదండలతోనే  అటవీ సంపద దోపిడికి గురవుతుందన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు  కొలువుదీరిన  జిల్లా కేంద్రానికి సమీప దూరంలోనే అడవులు అన్యక్రాంతమవుతున్న పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ప్రభుత్వాలు అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో  ప్రభుత్వ ఆలోచనకు  గండి పడుతుంది. హరిత హారం   కార్యక్రమాన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుండగా, అలాంటి చెట్లనే నరికి వేసిన  ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం  ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. లింగి తండా అటవీ ప్రాంతంలో స్థానిక తండావాసులు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో  అటవీ శాఖ అధికారులు  తూతూ మంత్రంగా  12 మంది పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. వారిలో ఇద్దరిని గుర్తించి  వారిపై రూరల్ పోలీస్ స్టేషన్లో  ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మరో పదిమంది పై అటవీ శాఖలో కేసు నమోదు చేసిన ఆ పదిమందిని ఇంతవరకు గుర్తించకపోవడం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. గత కొన్ని రోజులుగా అటవీ శాఖకు సంబంధించిన 70 ఎకరాలలో  చెట్లను నరుకుతున్న స్పందించకపోవడం స్థానిక తండావాసులుతో  కొందరి అటవీశాఖ అధికారులకు పెద్ద ఎత్తున లావాదేవీలు ఉన్నట్లు  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు  స్పందించి అంతరించిపోతున్న అటవీ సంపదను  పరిరక్షించి, స్థానికుల ఆట కట్టించాలని  పలువురు కోరుతున్నారు.


Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >
Image 1

వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

Posted On 2026-06-25 18:18:41

Readmore >
Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >