| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

News

Posted on 2025-12-07 19:45:50

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

ఇక సండే అయితే ఎవరు చెప్పినా ఎంత ఫైన్ వేసిన తగ్గేదేలే అంటున్న మద్యం ప్రియులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొన్ని రోజులుగా జిల్లాలో మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పోలీసులు మొదటిసారిగా పట్టుబడిన వారికి జరిమానా విధించి వదిలేస్తున్నారు. ఇక రెండవసారి అదే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కోర్టుకు అప్పజెప్పి 15వేల రూపాయల జరిమానా విడించడంతోపాటు కోర్టులో జడ్జి మద్యం ప్రియులకు కోర్టు శిక్ష ప్రకారం వారికి నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తున్నప్పటికీ మందుబాబుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు కనపడటం లేదు. ఓవైపు సిపి సాయి చైతన్య డ్రంక్ అండ్ డ్రైవ్ పై సీరియస్ గా వ్యవహరిస్తున్న మందు ప్రియులు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేవలం పైనే కదా కట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారో ఏంటో కానీ జరిమానాలకు, ఏ మాత్రం భయపడడం లేదు. ఇక వీకెండ్ ఆదివారం రోజు ఎలాగైనా మందు తాగాల్సిందే అనుకునే మద్యం ప్రియులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొన్నిసార్లు పట్టుబడుతున్నారు. మరికొన్నిసార్లు పోలీసులకు కన్ను కప్పి ఇతర మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. అయితే నిబంధన ప్రకారం  మద్యం సేవించి వాహనం నడిపితే 10000 జరిమానా కట్టాల్సిందేనని పోలీసులు చెబుతున్నప్పటికీ, రెండవసారి దొరికితే 15000 రూపాయలు, మూడవసారి దొరికితే జరిమానా తో పాటు జైలు శిక్ష సైతం కోర్టులో వారిని హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం జైలుకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివారం రైల్వే కమాన్ వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆదేశంసారం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 25 డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా వాహనాదారులు ఏ మాత్రం లెక్క చేయకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు. మద్యం సేవించి పట్టుపడితే మొదటిసారి పదివేల రూపాయలు రెండవసారి 15వేల రూపాయలు మూడవసారి జైలు శిక్ష పరి అవకాశం ఉందని వారు అన్నారు. అయితే మందుబాబుల ఆగడాలు అరికట్టాలంటే మద్యం తాగి వాహనాలు సేవించి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినప్పుడు వారి డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేస్తేనే వాహనదారులు ఒకింత భయం ఏర్పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >