Posted on 2025-12-08 13:05:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమ ప్రాంగణానికి వచ్చిన భక్తులతో ఆయన మాట్లాడుతూ, అయ్యప్ప స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >