Posted on 2025-12-08 13:49:01
డైలీ భారత్ న్యూస్, కాప్రా: హైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణం జరిగింది. దమ్మాయిగూడలోని సాకేత్ కాలనీలో ఉదయాన్నే కొంతమంది దుండగులు ఒక వ్యక్తిని అతికిరాతంగా పొడిచి పొడిచి చంపారు. మృతి చెందిన వ్యక్తి కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ కాలనీకి చెందిన వెంకటరత్నం (46) రియాల్టర్గా గుర్తించారు.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్టర్ వెంకటరత్నం.. స్కూటీపై తన కూతురిని స్కూలుకి తీసుకెళ్తుండగా ఐదుగురు దుండుగులు వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. దుండుగులు వెంబడించి మరీ చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియల్టర్ వెంకటరత్నంపై గతంలో ధూల్ పేట్ స్టేష్టన్లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయనపై రెండు హత్యలు చేయగా.. నిందితుడిగా ఉన్నారన్నారు. అయితే ఆయనను ఆ హత్యకు సంబంధించి ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >