డైలీ భారత్, హైదరాబాద్:ఆర్టీసీ చార్జీల పెంపు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టిన "చలో బస్భవన్" నిరసనకు ముందు కేటీఆర్ను గురువారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నంది నగర్లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. శాంతియుత నిరసనకే ప్రభుత్వం అడ్డుపడుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు నిర్బంధాలు బీఆర్ఎస్ను ఆపలేవని హెచ్చరించారు.
News
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హౌస్ అరెస్ట్