| Daily భారత్
Logo




"మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

News

Posted on 2025-10-09 12:11:41

Share: Share


"మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

-మహిళల మానసిక ఆరోగ్య సదస్సులో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పిలుపు.

డైలీ భారత్, సిరిసిల్ల: మానసిక ఆరోగ్య దినోత్సవంను  పురస్కరించుకొని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య నగర్ లోని మహిళలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ ఏర్పాటు చేసి మాట్లాడినారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాటడుతూ మహిళలు మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఇటీవలి కాలంలో మహిళలు కుటుంబం, ఉద్యోగం, సామాజిక బాధ్యతలు, మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం సాధించడంలో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. 

ఈ ఒత్తిడి ఫలితంగా ఆందోళన, నిరాశ, నిద్రలేమి, కోపం, మరియు శారీరక అనారోగ్యాలు ఏర్పడుతున్నాయని అన్నారు.

మహిళలు తమ కుటుంబ అవసరాలనే కాకుండా, తమ వ్యక్తిగత మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా సంరక్షించు కోవడానికి  ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఒక సంతోషకరమైన తల్లి, భార్య, ఉద్యోగిని కావాలంటే, ముందు మనసు ప్రశాంతంగా ఉండాలని అన్నారు.

మానసిక ఆరోగ్యం కోసం మహిళలు ప్రతిరోజూ స్వీయ సంరక్షణ, మంచి అలవాట్లు అవలంబించాలని తెలిపారు.

సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా స్నేహితులతో సంభాషణ, అవసరమైతే సైకాలజిస్టు  సహాయం పొందడం లాంటివి చేయాలని అన్నారు.

ఆరోగ్యకరమైన మనస్సే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపేల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, మహిళలు పాల్గొన్నారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >