Posted on 2025-10-09 15:43:47
డైలీ భారత్, ఫరూఖాబాద్: విజయవంతంగా టేకాఫ్ అయిన విమానం.. గాలిలో చక్కర్లు కొట్టకుండా.. చెట్ల పొదల్లో కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ పైలట్లు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేట్ జెట్ రన్వే నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే బ్యాలెన్స్ కోల్పోయి రన్వే పక్కన ఉన్న చెట్లపైకి దూసుకెళ్లింది.
విమానం భాగాలు చెట్లలో చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక అధికారులు తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జెట్లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానయాన శాఖ (DGCA) ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >