| Daily భారత్
Logo




రామంతపూర్ ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి : జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి

News

Posted on 2025-10-09 15:58:52

Share: Share


రామంతపూర్ ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి : జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగయత్ కాలనీ, వెంకట సాయి నగర్, సాయి కృష్ణ కాలనీలో బీరప్ప దేవాలయం వెనుక లైన్‌లో సాంక్షన్ అయిన బాక్స్ కల్వర్ట్ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి ప్రశ్నించగా, “బాక్స్ కల్వర్ట్ మరోచోట వేస్తాం” అని సర్కిల్-2 ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.

దీంతో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి వెంటనే జీహెచ్ఎంసి సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ రాజును కలిసి వివరాలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిఈ నాగమణి, ఏఈ మౌనికను పిలిచి వివరణ కోరగా, ఆమె తప్పు సమాచారం ఇచ్చారు. “ఆ లొకేషన్‌లో కల్వర్ట్ సాంక్షన్ కాలేదు. టెక్నికల్ రిపోర్ట్ ప్రైవేట్ వ్యక్తులతో చేయించుకున్నారు. మేము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు,” అని ఏఈ మౌనిక పేర్కొంది.

ఈ సందర్భంలో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి తన మొబైల్‌ లో జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కు  టెక్నికల్ రిపోర్ట్ చూపించారు. అదే సమయంలో  పై అధికారులకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని అడిగితే, ఏఈ మౌనిక “మీరు ఎవరు  నాను అడగడానికి? మా ఇష్టం వచ్చిన చోట మేము వేస్తాం. మాకు ఎక్కడ వేయాలో తెలుసు,” అంటూ పై అధికారుల సమక్షంలో అవమానకరంగా ప్రవర్తించింది.

జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, విధుల నుంచి తొలగించాలని ఆయన జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. “ఒక బాధ్యత గల జర్నలిస్టుతో ఇలా మాట్లాడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

త్వరలో ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, జీహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్, లోకాయుక్త జడ్జి వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు విజయేందర్ రెడ్డి తెలిపారు.

Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >