Posted on 2025-10-09 19:43:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు, అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ముఖ గుర్తింపు విధానం(ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు తీసుకున్నారా అని పరిశీలించారు. విద్యార్థులు కోసం వండిన మద్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. డైనింగ్ హాల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, పనులను పూర్తి చేయించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరంలలో ప్రభుత్వ ఐ.టీ.ఐ లకు అనుసంధానంగా ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఇంకనూ అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
Posted On 2025-11-13 10:03:28
Readmore >
జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి
Posted On 2025-11-12 19:12:07
Readmore >
పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
Posted On 2025-11-12 19:10:42
Readmore >
అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు
Posted On 2025-11-12 19:09:07
Readmore >
నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
Posted On 2025-11-12 13:27:18
Readmore >
JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం
Posted On 2025-11-12 08:50:16
Readmore >
ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
Posted On 2025-11-12 08:47:02
Readmore >