Posted on 2026-05-03 18:11:11
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 18 పండ్ల దుకాణాలు, పాన్ షాపులు మరియు టీ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు తమ ఆస్తులను కాపాడుకునేలోపే భారీ నష్టం వాటిల్లింది.
ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కుమారుడు, రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆయనతో పాటు డిసిసి మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు
పండ్ల రాజు, ఇప్ప శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన మహమ్మద్ ఇలియాస్, జరిగిన నష్టాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి, బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంలో ఆస్తి కోల్పోయిన వ్యాపారులను ఆదుకోవడానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనతో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆర్థికంగా ఆధారపడిన పలువురు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు నష్టపరిహారం అందెల కృషి చేస్తామన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >