| Daily భారత్
Logo




హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

News

Posted on 2026-05-04 18:53:54

Share: Share


హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

డైలీ భారత్, కడియం: కడియం మండలం పరిధిలోని బుర్రిలంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు ఇంజన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు లో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

స్థానికులు సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులోని ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం ప్రకారం, అత్తిలి నుంచి రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 19:52:45

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >
Image 1

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

Posted On 2026-05-04 18:00:43

Readmore >
Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >