డైలీ భారత్, బెల్లంపల్లి:మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం బెల్లంపల్లిలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు.
News
బెల్లంపల్లి: కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్