డైలీ భారత్, కన్నెపల్లి: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించి, ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
News
కన్నెపల్లి: ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్