Posted on 2025-10-08 20:08:09
తెరమీదికి రాబోతున్న ఈరవత్రి అనిల్ సతీమణి సుహాసిని..
మరి సీనియర్ మహిళా బీసీ నేత ఆకుల లలిత పరిస్థితి ఏంటి..?
జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన జడ్పీ చైర్మన్ పీఠం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. అయితే, పదవి ఆశించి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారిని కాదని, కష్టకాలంలో జెండా మోసిన వారికే అధిష్టానం పట్టం కట్టాలని నిర్ణయిం చుకున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ జరు గుతుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి, సదువుల కోసం వేరే పార్టీలో చేది. ఇప్ప మళ్లీ కాంగ్రెస్ అధికారంలో కి రాగానే తిరిగొచ్చిన వారికి జడ్బీ చైర్మన్ సీటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలుస్పష్టం చేస్తున్నాయి. పార్టీలోకి చేరేముందే, పదవులు ఆశించకుండా వస్తేనే రండి అని కాంగ్రెస్ పెద్దలు గతంలోనే తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ చర్చకు ప్రధాన కారణం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గతంలో కాం గ్రెస్లో ఉన్నప్పుడు ఆర్మూర్ టికెట్ ఇవ్వగా, ఆమె ఎన్నికల సమయంలో పార్టీకి ద్రోహం చేసి, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి సహకరిస్తూ సరెండర్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో రాగానే ఆమె ఆ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగి యగానే, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో, ఆమె ఆ పదవికి రాజీనామా చేసి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కష్టకాలంలో పార్టీని వీడిన వారికి జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం లేదనే చర్చ మొదలైంది. అయితే, జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రస్తుత మినరల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఈరవత్రి అనిల్ సతీమణి సుహాసిని వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాచనతో అనిల్ తన స్థానాన్ని బాల్కొండ అభ్యర్థి సునీల్ రెడ్డికి త్యాగం చేశారు. ఈరవత్రి అనిల్ పార్టీలో సీనియర్ నేతగా ఉండటం, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడటం, నేతలందరి మద్దతు. ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండటం వంటి అంశాలు మహాసినికి కలిసి వస్తున్నాయట. సుహాసిని మెండోర నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ, అనిల్ భార్య సుహాసినికే జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని జిల్లాలో చర్చ జోరందుకుంది.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >