| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న : రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న : రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

అన్నదానం ఎంతో పవిత్రమైనది

పాత పాల్వంచ సాయిబాబా దేవాలయంలో పుణ్యస్థితి పూజలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అన్నదానం ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ లోని శ్రీ షిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సాయిబాబా 107వ పుణ్యస్థితి (సమాధి) పూజోత్సవాల్లో* భాగంగా శనివారం సుమారు *1000 మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. పూజారి దాసోజు సతీష్ ఆచార్యులు ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబాకు అఖండ దీపారాధన, ఉద్వాసన,ధుని పూజలు నిర్వహించారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ భక్తులకు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందన్నారు. సాయిబాబా కు అన్నదానం ఎంతో ఇష్టమని కొత్వాల అన్నారు. 

ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపకులు ఆలయ ధర్మకర్త ముత్యాల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, గంధ మల్ల రాజయ్య,పాశం నాసరయ్య, గూడపాటి నాగేశ్వరరావు, ముదిగొండ శ్రీనివాసరావు,బొట్టు రమేష్,చింతలచెరువు,జనార్ధన రెడ్డి,మాజీ జడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య,కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న,వై వెంకటేశ్వరరావు, లోగాని సత్యనారాయణ,దోప్పలపూడి వెంకటేశ్వరరావు,పాశం నరసింహారావు,పాశం గోపాలరావు పెద్దింటి రాంబాబు, మహేందర్, ఉట్కురి శ్రీను,వంగ రమేష్,రౌతు మల్లేష్,బర్ల అన్వేష్,శంకర్ రెడ్డి, అమృతవల్లి శైలజ,ముత్యాల కృష్ణవేణి,వరలక్ష్మి,కృష్ణకుమారి, పార్వతమ్మ,ఆకుల కృష్ణవేణి, సునీత,జ్యోతి, విజయలక్ష్మి, శివరంజని, సావిత్రమ్మ,గీత,సంధ్య, భాగ్యలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Previous గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కాంగ్రెస్ కే సాధ్యం -రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
Next విద్యుత్ స్తంభం పై నుండి ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు
ADVERTISEMENT