Posted on 2025-10-04 18:49:03
పాల్వంచ మండలంలో కొత్వాల విస్తృతపర్యటన
డైలీ భారత్, పాల్వంచ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వలనే సాధ్యం అవుతుందనీ రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలంలోని పలు గ్రామాలలో శనివారం కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా జగన్నాధపురం, నాగారం గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ZPTC, MPTC, సర్పంచ్ ల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ధర్మసోత్ ఉపేందర్, కొండం పుల్లయ్య, పెండ్లి రామిరెడ్డి, బాదర్ల నాగేశ్వరరావు, బానోత్ బాలాజీ, కామాచారి, బ్రహ్మచారి, కుమార్, నాగారం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >