Posted on 2025-10-04 17:40:19
కొణిజర్ల మండలం అంజనా పురం
గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ సత్వరమే పూర్తి చేయాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింత నిప్పు చలపతిరావు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం లో ప్రైవేటు సెక్టార్ లో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల పైగా సాగు భూములు రైతుల నుంచి సేకరించి గోద్రెజ్ కంపెనీ కి అప్పగించి మూడు సంవత్సరాల అవుతుంది అని, పామాయిల్ పరిశ్రమ శంకుస్థాపన జరిగి రెండు సంవత్సరాల అవుతున్న పనులు పూర్తి కాలేదు అని సత్వరమే పరిశ్రమ రైతులకు అందుబాటులో కి తీసుకు రావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు అన్నారు.
శుక్రవారం రైతు సంఘం బృందం పామాయిల్ రైతులతో కలిసి అంజనా పురం వద్ద గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ కు కేటాయించిన భూములను పరిశీలించారు, పనులు వేగవంతం చేసి పామాయిల్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభం చేయుట వలన రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు, నర్సరీ లో పామాయిల్ మొక్కలు పెంపకం లో కర్లింగ్, ఆఫ్ టెక్ వాటిని గుర్తించి గ్రెడింగ్ చేసే విధానం అంజనా పురం నర్సరీ లో సరైన పద్ధతి లో ఉందని నిత్యం రైతులకు నష్టం జరగకుండా పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపవరం సోసైటి డెరైక్టర్, పామాయిల్ రైతులు సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం,కట్టా రాంబాబు, దుగ్గిన్ని అజయ్ తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >