Posted on 2025-10-04 17:40:19
కొణిజర్ల మండలం అంజనా పురం
గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ సత్వరమే పూర్తి చేయాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింత నిప్పు చలపతిరావు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం లో ప్రైవేటు సెక్టార్ లో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల పైగా సాగు భూములు రైతుల నుంచి సేకరించి గోద్రెజ్ కంపెనీ కి అప్పగించి మూడు సంవత్సరాల అవుతుంది అని, పామాయిల్ పరిశ్రమ శంకుస్థాపన జరిగి రెండు సంవత్సరాల అవుతున్న పనులు పూర్తి కాలేదు అని సత్వరమే పరిశ్రమ రైతులకు అందుబాటులో కి తీసుకు రావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు అన్నారు.
శుక్రవారం రైతు సంఘం బృందం పామాయిల్ రైతులతో కలిసి అంజనా పురం వద్ద గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ కు కేటాయించిన భూములను పరిశీలించారు, పనులు వేగవంతం చేసి పామాయిల్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభం చేయుట వలన రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు, నర్సరీ లో పామాయిల్ మొక్కలు పెంపకం లో కర్లింగ్, ఆఫ్ టెక్ వాటిని గుర్తించి గ్రెడింగ్ చేసే విధానం అంజనా పురం నర్సరీ లో సరైన పద్ధతి లో ఉందని నిత్యం రైతులకు నష్టం జరగకుండా పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపవరం సోసైటి డెరైక్టర్, పామాయిల్ రైతులు సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం,కట్టా రాంబాబు, దుగ్గిన్ని అజయ్ తదితరులు పాల్గొన్నారు
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >