Posted on 2025-09-19 21:24:59
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రస్మా ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు అర్బన్ నియోజకవర్గనికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలనీ ముఖ్యమంత్రికి పలు సార్లు విన్నవించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గనికి రావలిసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసే బాధ్యత జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర" అంటు గురువుకు ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరిగిందన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో గురువు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు అని అన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం పోటీ మాత్రమే కాకుండా సమాజంపై అవగాహన పెంపొందించడంతో పాటు దేశానికి ఉపయోగపడేవిందంగా విద్యార్థులను నిర్మాణం చేయాలనీ పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లి తండ్రులు పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు.పిల్లలకు మంచి బుద్ది జ్ఞానం అందించే దిశగా వారికీ మహాభారతం, భారత రాజ్యాంగం వంటి పవిత్ర గ్రంధాలను చదవడం అలవాటు చేయాలన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >