| Daily భారత్
Logo




తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గౌరవింపబడే వ్యక్తి ఉపాధ్యాయుడు

News

Posted on 2025-09-19 17:46:13

Share: Share


తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గౌరవింపబడే వ్యక్తి ఉపాధ్యాయుడు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:సమాజంలో అన్ని దానాలకన్నా విద్యా దానం అత్యున్నతమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) శివారులో, శుక్రవారం నిజామాబాద్ జిల్లా ట్రస్మా (ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం సందర్భంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత సమాజంలో గురువులను పూజిస్తారని,

భావి భారత పౌరులను తీర్చిదిద్దే నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భూదానం, గో దానం, అన్నదానం చేసినా, అన్నిటికన్నా గొప్పది విద్యాదానం అని పేర్కొన్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖకు 22 వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించిందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారని, తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపిస్తున్నారని, మార్కులు – ర్యాంకులు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వ వికాసం కలిగేలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. తరగతి గదుల్లో ప్రతిభావంతులతో పాటు బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులు కూడా ఉంటారని, వారిని సమూహ చర్చల ద్వారా ప్రోత్సహించి తెలివితేటలు పెంచేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్, రజినీకాంత్, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >