| Daily భారత్
Logo




తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గౌరవింపబడే వ్యక్తి ఉపాధ్యాయుడు

News

Posted on 2025-09-19 21:16:13

Share: Share


తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గౌరవింపబడే వ్యక్తి ఉపాధ్యాయుడు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:సమాజంలో అన్ని దానాలకన్నా విద్యా దానం అత్యున్నతమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) శివారులో, శుక్రవారం నిజామాబాద్ జిల్లా ట్రస్మా (ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం సందర్భంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత సమాజంలో గురువులను పూజిస్తారని,

భావి భారత పౌరులను తీర్చిదిద్దే నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భూదానం, గో దానం, అన్నదానం చేసినా, అన్నిటికన్నా గొప్పది విద్యాదానం అని పేర్కొన్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖకు 22 వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించిందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారని, తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపిస్తున్నారని, మార్కులు – ర్యాంకులు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వ వికాసం కలిగేలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. తరగతి గదుల్లో ప్రతిభావంతులతో పాటు బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులు కూడా ఉంటారని, వారిని సమూహ చర్చల ద్వారా ప్రోత్సహించి తెలివితేటలు పెంచేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్, రజినీకాంత్, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >