Posted on 2025-09-19 14:12:30
డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల యందు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ ఇచ్చే ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ G. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y. శ్రీనివాస్ విచ్చేయడం జరిగింది.DIEO మాట్లాడుతూ విద్యార్థినులు ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కష్టపడి చదువాలని అన్నారు. ఈ కళాశాల విద్యార్థినులు మంచి మార్కులతో రాష్ట్ర స్థాయి లో ర్యాంక్ లు తీసుకురావడం జరిగిందని వారికి అభినందనలు తెలియచేస్తూ ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొని రావాలని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ...
ప్రపంచంలో చదువుకు మించిన సంపద ఏది లేదని ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులు ఆటపాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళీ, సీతారాము, k. సునీత, ఆఫ్రోజ్ సుల్తానా,శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, జబిఉల్లా,M. సునీత, గంగరాజు, కృష్ణవేణి , ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >