| Daily భారత్
Logo




సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

News

Posted on 2026-08-29 10:54:50

Share: Share


సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

లక్షలు ఖర్చు చేసి కట్టారు.. నిరుపయోగంగా వదిలేశారు!

ఫారెస్ట్ ఆఫీస్ పక్కన అధ్వాన్నంగా పబ్లిక్ టాయిలెట్లు... పట్టించుకోని మున్సిపాలిటీ

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వచ్ఛతకు తూట్లు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం పక్కన ఉన్న మున్సిపల్ పబ్లిక్ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. చాలా రోజులుగా మూతపడి ఉండటంతో పరిసర ప్రాంతమంతా పిచ్చి మొక్కలు పెరిగి, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.

దీంతో ఆ మార్గంలో నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆర్డీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వందలాది మందికి మరుగుదొడ్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ఇలా నిర్వహణ లేకుండా వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మరుగుదొడ్లను శుభ్రం చేసి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >