Posted on 2025-09-17 11:49:30
పెండింగ్ D.A. లు చెల్లించాలి
ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలి
TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి డిమాండ్
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల కృష్ణ చైతన్య, చందుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సంజీవ్, ప్రధాన కార్యదర్శి, కొత్తూరు శ్రీధర్ ల ఆధ్వర్యంలో సమస్యల సేకరణలో భాగంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లోని సమస్యలను సేకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ 5 డి. ఎ. లు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అంతేకాకుండా ఎన్నో రోజులుగా 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్న ప్రభుత్వం న్యాయం చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది అని వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు TET నుండి మినహాయించాలని, అసంబద్ధ నిబంధనల పేరుతో దాదాపుగా 20 సంవత్సరాల పైన సర్వీస్ పూర్తిచేసిన ఉపాధ్యాయులను TET రాయమనడం అన్యాయం, అని వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే PRC ప్రకటిస్తామని చెప్పి, ఇంతవరకు ప్రకటించక పోవడం అన్యాయం అని వెంటనే PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల కృష్ణ చైతన్య, చందుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సంజీవ్, TPTF బాధ్యులు కొత్తూరు శ్రీధర్, పాము వెంకట్, కర్ర శ్రీధర్, రాచకొండ ప్రసాద్, లు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >