Posted on 2025-09-17 13:01:06
జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా జిల్లా కేంద్రంలో బిజెపి శ్రేణులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు భారతమాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవాలాందిస్తున్న నరేంద్రమోదీ గారు నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం అని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశన్ని విశ్వగురువుగా నిలబెట్టలనే సంకల్పంతో, భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్రమోడీ జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవకార్యక్రమాలు నిర్వహించి దేశ ప్రధాని కి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరంతరం భారతమాతకు సేవలాందిస్తున్న ఆ మహనీయులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, రానాదీష్, మండల అధ్యక్షులు నాగరాజు,బీజేపీ ఓబీసీ నాయకులు, స్వామి యాదవ్, గిరి బాబు, డాక్టర్ రాఘవేంద్ర , ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బీజేపీ నాయకులు ఆనంద్, సంజయ్ పురోహిత్,నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >