Posted on 2025-09-17 08:15:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ను నిజాం చేరనుండి విడిపించి తెలగాణలో విలీనం చేసినందున ఈ రోజును జరుపుకుంటున్నామని,నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడటం జరిగింది అని తెలిపారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతుంది అని,ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, జెండా గుడి చైర్మన్ ప్రమోద్, మార్కెట్ కమిటీ మెంబర్ ఈసా, మాజీ కార్పొరేటర్లు కుద్దుస్, రాజేంద్ర ప్రసాద్, నరేందర్ గౌడ్, శ్రీశైలం,ముశ్షు పటేల్,నరేంద్ర సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >