Posted on 2025-09-17 11:45:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ను నిజాం చేరనుండి విడిపించి తెలగాణలో విలీనం చేసినందున ఈ రోజును జరుపుకుంటున్నామని,నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడటం జరిగింది అని తెలిపారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతుంది అని,ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, జెండా గుడి చైర్మన్ ప్రమోద్, మార్కెట్ కమిటీ మెంబర్ ఈసా, మాజీ కార్పొరేటర్లు కుద్దుస్, రాజేంద్ర ప్రసాద్, నరేందర్ గౌడ్, శ్రీశైలం,ముశ్షు పటేల్,నరేంద్ర సింగ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >