Posted on 2025-09-17 11:44:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతు కాసిం రాజ్వి లాంటి క్రూర మృగాలు మన తెలంగాణ ఆడబిడ్డల మానాలు దోచుకుని బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన సందర్భంలో ఎదురు తిరిగిన ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను సజీవంగా దహనం దుర్మార్గుడు నిజాం నవాబు అని అన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీగోండ్, దొడ్డి కొమురయ్య,చాకలి ఐలమ్మ,దాశరధి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ ఎందరో మహనీయులు నిజాంకు ఎదురుతిరిగి ప్రాణాలు అర్పించారని అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగోషాను అర్ధం చేసుకున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్ )తో నిజాం మేడలు వంచి, నిజాం కబంద హస్తల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ బిడ్డలకు 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవనికి ప్రతీక అయినా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపకుండా గత ప్రభుత్వం బి ఆర్ ఎస్ , ఇప్పటి కాంగ్రెస్ తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఓ వర్గం దగ్గర తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి, తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురుతిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావి తరాలకు తెలియజేయాలన్నారు. నిజాం ఆనవాళ్ళను పూర్తిగా చేరిపివేయాలి అందులో భాగంగా నిజామాబాదును ఇందూర్ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమానికి ఉపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల పేర్లు మార్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డల పేర్లు పెట్టాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు,జిల్లా ఉపాధ్యక్షులు పాలేపు రాజు,జిల్లా కార్యదర్శి జోతి గారు,జిల్లా బీజేపీ నాయకులు,బీజేపీ మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >