Posted on 2025-09-16 11:44:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేశ వ్యాప్తంగా సోమవారం ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలో ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల రంగంలో విశేష కృషి చేసిన ఇంజనీర్ల సేవలను గౌరవించి, అంకితం చేయబడిందే ఈ ఇంజనీర్ల దినోత్సవం.ప్రముఖ ఇంజనీర్, పండితులు, భారతరత్న మోక్షగుండం విశ్వశ్వరయ్య పుట్టినరోజు ను ఇంజనీర్ల దినోత్సవం గా జరుపుకుంటారు. ఆధునిక సమాజ నిర్మాణం లో ఇంజనీర్ల పాత్ర అనిర్వచనీయం, అద్భుతాలు సృష్టించాలన్న సమాజాన్ని సాంకేతిక రంగం లో అగ్రపథాన నిలపాలన్న అది ఇంజనీర్లతోనే సాధ్యం. ఈ సందర్బంగా జిల్లా కేంద్రం లోని ఆకాశవాణి కేంద్రంలో ఇంజనీర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతు ఆధునిక సమాజం లో ఇంజనీర్ల పాత్ర అత్యున్నతమైనదిగా కొనియాడారు. ఆకాశవాణి లో ఇంజనీర్ల సహాయ సహకారాలతో కార్యక్రమాలు స్పష్టంగా శ్రోతలకు చేరుతున్నాయన్నారు. ఈ సందర్బంగా కేంద్రం లోని ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటసుబ్బయ్య, సుధాకర్,విలాస్, గోపాల్, జ్యోతిరాజ్, అశోక్ కుమార్, నవీన్ కుమార్, రమేష్, మహేందర్,మోహన్ దాస్, శరత్ సాయికుమార్,మదన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >