Posted on 2025-09-15 16:37:35
45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా చందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో 1980 -81వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరినీ అలరించింది. సుమారు 45 సంవత్సరాల తర్వాత అందరు చందూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చేరుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా వారు సత్కరించారు. ఇద్దరు గురువులను ఆత్మీయంగా సన్మానించారు..
చందూర్ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించరాని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రైవేటు ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో రాణించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించడం వల్లే అప్పటి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. ఆ కాలంలో విద్యార్థులు గురువుల పట్ల ఎంతో గౌరవం మర్యాదలతో మెదిలే వారిని ఇప్పుడున్న విద్యావ్యవస్థలో అవి కనుమరుగయ్యాయని అన్నారు. ఏదేమైనప్పటికీ 45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >