Posted on 2025-09-15 16:37:35
45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా చందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో 1980 -81వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరినీ అలరించింది. సుమారు 45 సంవత్సరాల తర్వాత అందరు చందూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చేరుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా వారు సత్కరించారు. ఇద్దరు గురువులను ఆత్మీయంగా సన్మానించారు..
చందూర్ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించరాని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రైవేటు ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో రాణించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించడం వల్లే అప్పటి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. ఆ కాలంలో విద్యార్థులు గురువుల పట్ల ఎంతో గౌరవం మర్యాదలతో మెదిలే వారిని ఇప్పుడున్న విద్యావ్యవస్థలో అవి కనుమరుగయ్యాయని అన్నారు. ఏదేమైనప్పటికీ 45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >