Posted on 2025-09-15 13:07:35
45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా చందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో 1980 -81వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరినీ అలరించింది. సుమారు 45 సంవత్సరాల తర్వాత అందరు చందూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చేరుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా వారు సత్కరించారు. ఇద్దరు గురువులను ఆత్మీయంగా సన్మానించారు..
చందూర్ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించరాని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రైవేటు ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో రాణించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించడం వల్లే అప్పటి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. ఆ కాలంలో విద్యార్థులు గురువుల పట్ల ఎంతో గౌరవం మర్యాదలతో మెదిలే వారిని ఇప్పుడున్న విద్యావ్యవస్థలో అవి కనుమరుగయ్యాయని అన్నారు. ఏదేమైనప్పటికీ 45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >