Posted on 2025-09-15 16:36:05
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఓ విద్యార్థి సంఘం నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని వార్త సేకరణలో భాగంగా అక్కడికి వెళ్లి వార్త సేకరించి తిరిగి అటువైపు గుండా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న ఓ మీడియా ప్రతినిధి వాహనాన్ని ఆపిన ఆ ట్రాఫిక్ ఏ ఆర్ ఏ ఎస్ ఐ తీరుకు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ స్పందించారు. జర్నలిస్టులపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన ఆ ఏ ఆర్ ఏ ఎస్ ఐ ని మండలించినట్లుగా ప్రజలకు ఇబ్బందికరంగా ట్రాఫిక్ సిబ్బంది ఎవరు కూడా ప్రవర్తించవద్దని ట్రాఫిక్ నియమాలను పాటించని వారిపైనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై దృష్టి పెట్టాలని తమ ప్రాప్ సిబ్బందికి సూచించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. సదరు ఏఎస్ఐ చర్య పై జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన సదరు ఏఎస్ఐ పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >